ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (15:36 IST)
ఒరిస్సా రాష్ట్రంలో రైలు ప్రమాదం సంభవించింది. బెంగుళూరు నుంచి గౌహతికి వెళుతున్న కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన శనివారం రాత్రి 11.54 గంటల సమయంలో కటక్ సమీపంలోని నేరగుండి స్టేషన్ వద్ద జరిగింది. అయితే, అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. 
 
ఈ ప్రమాదంలో మొత్తం 11 ఏసీ బోగీలు పట్టాలు తప్పాయని, ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారభించినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్వో అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనకు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. 
 
ఈ ప్రమాదం కారణంగా కొన్ని రైళ్ల రాకపోకల్లో మార్పులు చేయగా, మరికొన్ని రైళ్ళను దారిమళ్లించినట్టు తెలిపారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖ ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్లను రైల్వే శాఖ విడుదల చేసింది. కాగా, గత 2023లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెల్సిందే. షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగుళూరు - హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు ఒకదానికొకటి ఢీకొనగా 296 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1200 మంది వరకు గాయపడిన విషయంతెల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments