Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (14:37 IST)
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీకి చెందిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నాగలి పట్టి, ఏరువాక సేద్యాన్ని ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం, వీఎన్ పురంలోని తన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్న ఎంపీ కలిశెట్టి.. ఎద్దులు, నాగలిని పూజించారు. ఆ తర్వాత ఎద్దులకు అరక కట్టి నాగలితో భూమిని దున్నారు. 
 
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ సభ్యుడుగా తొలిసారి ఏరువాక నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రైతులు, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాక్షించారు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు మంచి పథకాలు తీసుకొస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పనాయుడు వ్యాఖ్యానించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments