Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు అప్రమత్తంగా ఉండాలి : ప్రధాని మోడీ

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (15:28 IST)
దేశంతో పాటు.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 
వాక్సిన్ వచ్చేంత వరకూ భౌతిక దూరంతో పాటు మాస్కులను కూడా తప్పకుండా ధరించాలని ఆయన సూచించారు. వలస కూలీల నిమిత్తమై రూపొందించిన 'ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్' పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, 'మనందరి జీవితాల్లో ఎత్తు పల్లాలుంటాయి. మన మన సామాజిక జీవితాల్లో కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటాం. ప్రపంచమంతా ఒకేసమయంలో ఒకే సమస్యను ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించలేదు. 
 
ఈ వ్యాధి నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదు. వాక్సిన్ వచ్చేంత వరకూ రెండు గజాల దూరం పాటించాలి. మాస్కులను తప్పకుండా ధరించాలి. కరోనా సోకకుండా చూసుకోవాలి' అని సూచించారు. 
 
అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్నారు. దీనికి నిదర్శనమే నాలుగు యూరోపియన్ యూనియన్ దేశాల్లో మరణాల సంఖ్య 1.30 లక్షలు ఉంటే, యూపీలో కేవలం 600 మాత్రమే ఉన్నాయని ప్రధాని మోడీ గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments