Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం... ప్రచారం బంద్.. ఐఏఎస్ బదిలీ

Webdunia
గురువారం, 16 మే 2019 (12:14 IST)
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నిర్ణీత గడువు కంటే ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిషేధించింది. దీంతో చివరి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రచారం గురువారం రాత్రి 10 గంటలతోనే ముగియనుంది. వాస్తవానికి ఈ దశ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియాల్సివుంది. 
 
రెండు రోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేపట్టిన రోడ్ షో సందర్భంగా బీజేపీ - టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగిన విషయం తెల్సిందే. దీంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని ఈసీ తీవ్రంగా పరిగణించి ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసింది. 
 
అంతేకాకుండా, ప్రభుత్వ అధికారులపై కొరడా ఝుళిపించింది. ఓవైపు అధికార తృణమూల్, బీజేపీల మధ్య వీధి పోరాటాలు తీవ్రరూపు దాల్చిన నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. సీఐడీ ఏడీజీ రాజీవ్ కుమార్‌ను కేంద్రానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఆయన వెంటనే ఢిల్లీలోని హోంశాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎంతో కీలకమైన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భట్టాచార్యపైనా వేటు పడింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుని సీఈవోకు లేఖ రాయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. 

సంబంధిత వార్తలు

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments