Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కార్యాలయాన్ని పేల్చేసిన నక్సల్స్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (11:02 IST)
సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో నక్సల్స్ దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. ఈనెల ఒకటో తేదీన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గడ్చిరోలిలో మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు 16 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని పేల్చివేశారు. 
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సారైకేలా జిల్లా, కుంతీ లోక్‌సభ పరిధిలోని కర్సవాన్‌లోని బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చి వేశారు. గురువారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన నక్సల్స్, కేన్ బాంబులను ఉపయోగించి పార్టీ ఆఫీస్‌ను పేల్చి వేశారు.
 
కుంతి లోక్‌సభ స్థానం నుంచి జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కుంతితో పాటు కోడెర్మా, రాంచీ నియోజకవర్గాల్లో నేడు అమిత్ షా ఎన్నికల ర్యాలీలను నిర్వహించాల్సి వుంది. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా 6వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments