Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ మిస్టర్ క్లీన్... అవినీతిపరుడంటే ఎవరూ నమ్మరు : బీజేపీ మంత్రి

Webdunia
గురువారం, 9 మే 2019 (13:54 IST)
మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, రాజీవ్ నంబర్ వన్ అవినీతిపరుడంటూ ఆరోపించారు. దీన్ని బీజేపీ నేత, కేంద్ర మంత్రి శ్రీనివాస ప్రసాద్ తీవ్రంగా ఖండించారు.
 
దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ అనవసరంగా మాట్లాడారని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా, రాజీవ్ అవినీతిపరుడు అంటే దేశంలో ఎవరు నమ్మరన్నారు. రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి నేతలు సైతం రాజీవ్‌ను ప్రశంసల వర్షంలో ముంచెత్తారని గుర్తుచేశారు. 
 
రాజీవ్ గాంధీ తన రాజకీయ జీవితంలో మిస్టర్ క్లీన్‌గా బతికాడని ప్రశంసించారు. ఎల్టీటీఈ కుట్రలో భాగంతో రాజీవ్ గాంధీ హతమయ్యాడన్నారు. చిన్న వయసులోనే రాజీవ్ గాంధీ పెద్ద బాధ్యతలు చేపట్టి దేశానికి సేవ చేశారని కొనియాడారు. మోడీ అంటే తనకు కూడా గౌరవం ఉందని రాజీవ్ గాంధీ జీవితం అవినీతి పరుడిగా ముగిసిందనడం తప్పని సూచించారు. కర్ణాటక రాష్ట్రంలోని చమరాజ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి శ్రీనివాస ప్రసాద్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments