Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ఘనత సాధించిన ఈసీ... అభ్యర్థి పేరు పక్కన బటన్ లేకుండానే ఈవీఎమ్

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (16:08 IST)
ఈ ఎన్నికల్లో రకరకాల చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగాననే తమిళనాడు ఎన్నికల్లో ఒక విచిత్రం చోటుచేసుకుంది. కడలూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ స్టేషన్‌లో అభ్యర్థి పేరు పక్కన ఓటు వేయడానికి అసలు బటనే లేదు. కడలూరు లోక్‌సభకు టీటీవీ దినకరన్‌కు చెందిన ఏఎమ్ఎమ్‌కే పార్టీ అభ్యర్థిగా కాశీ తంగవేల్ పోటీ చేస్తుండగా ఆయనకు 16వ స్థానం కేటాయించారు. 
 
అందుకు తగ్గట్టుగా ఈవీఎంలో అభ్యర్థి పేరు, పక్కన ఫొటోలు కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడానికి పక్కన ఓ బటన్ ఉటుంది. అయితే, ఆ పోలింగ్ స్టేషన్‌లోని ఈవీఎంలో మిగిలిన 15 మంది పేర్ల పక్కన బటన్ ఉంది. కానీ, ఏఎమ్ఎమ్‌కే అభ్యర్థి పేరు పక్కన మాత్రమే బటన్ కనిపించలేదు.
 
దీంతో ఓటు వేయడానికి వెళ్లిన కొందరు దాన్ని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం పార్టీల నేతలకు కూడా తెలియడంతో అందరూ అక్కడికి చేరుకుని నిరసన తెలియజేసారు. దీంతో ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి ఆ పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్‌ను వాయిదా వేశారు. సాధారణంగా పోలింగ్ మొదలు పెట్టడానికి ముందే ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను తనిఖీ చేసి, మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అందులో ఏ అభ్యర్థికి వేసిన ఓటు అతనికే పడుతున్నాయా లేదా అని పరిశీలిస్తారు. అయితే, అసలు అభ్యర్థి పేరు పక్కన బటనే లేకపోవడాన్ని కూడా ఎన్నికల సిబ్బంది గుర్తించలేకపోవడంపై ఏఎమ్ఎమ్‌కే కార్యకర్తలు మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments