Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైకిల్ గుర్తుకు ఓటేస్తే... ఫ్యాను లాగేస్తోంది : చంద్రబాబు

సైకిల్ గుర్తుకు ఓటేస్తే... ఫ్యాను లాగేస్తోంది : చంద్రబాబు
, గురువారం, 11 ఏప్రియల్ 2019 (11:10 IST)
సార్వత్రిక ఎన్నికల తొలి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనేక ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతానికి పైగా ఈవీఎంలు పని చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. 
 
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలను తాము అంగీకరించబోమని, రాష్ట్రంలోని 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదన్నారు. ఇపుడే నాలుగు గంటల సమయం వృథా అయిన కారణంగా ఈవీఎంలు పనిచేయని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషనరు ద్వివేదీకి లేఖ రాశారు. 
 
ఈవీఎంల పనితీరుపై రాష్ట్రమంతటి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే అది వైసీపీకి వెళుతున్నట్టు తెలుస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అన్ని పోలింగ్ బూత్‌లలో ఓటర్లు మొత్తం వచ్చి ఓటేసేంత సమయం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్లు ఆందోళన చేస్తున్నా అధికారులు ఎవరూ స్పందించడం లేదని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ అసెంబ్లీ పోల్ : ఉద్రిక్త వాతావరణం.. టీడీపీ - వైకాపా కార్యకర్తల ఘర్షణలు