పాలు కావలసి వచ్చినప్పుడు ఆవుల వద్దకు వెళ్లి...?

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (12:25 IST)
అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్
గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే
పిదికిన గాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా...
 
భాస్కరా.. ఈ భూమి యందెవరికైనను పాలు కావలసి వచ్చినప్పుడు ఆవుల వద్దకు వెళ్లి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలుకొఱకాయావుల పొదుగులను కోసినచో వానికి పాలు లభించవు. అట్లే ప్రజలను పాలించి రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవముగా చూచినచో వారు ఆదరాభిమానము లాతనిపై జూపుటయేగాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వారేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన.. మొట్టమొదటి 133-క్విట్ క్వాంటం కంప్యూటర్‌ను..?

పవన్ సౌలభ్యాన్ని బట్టి వేషం మారుస్తారు.. క్షమాపణలు చెప్పాల్సిందే.. రోజా

కేసీఆర్‌కు జాతిపిత బిరుదు.. ఎప్పటికీ ఆమోదించను - ప్రొఫెసర్ కోదండరామ్

రోడ్డు యాక్సిడెంట్ చేసినవాడిని ఎందుకు జైలులో వెయ్యరు?

తెలంగాణలో ప్రచారానికి పవన్ కల్యాణ్ రారట.. కారణం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

తర్వాతి కథనం
Show comments