Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 9న ఒడిశాలో పర్యటించనున్న సీఎం జగన్

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (13:16 IST)
ఆంధ్రప్రదేశ్లో కీలక ప్రాజెక్టుల పూర్తిపై రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఈనెల 9న ఒడిశాలో పర్యటించనున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించనున్నారు. ముఖ్యగా జలవివాదాల పరిష్కారంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. వంశధార నదిపై నిర్మిస్తున్న నేరడి బ్యారేజ్ పూర్తి చేయడానికి ఒడిశా ప్రభుత్వ సహకారాన్ని కోరనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. జగన్ తన పర్యటనలో ఒడిశా సీఎంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను కలవనున్నారు.
 
 
వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణంతో శ్రీకాకుళం, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలని ఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని.. బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని గతంలో రాసిన లేఖలో సీఎం జగన్.. నవీన్ పట్నాయక్‌ ను కోరారు. ఆ క్రమంలో జగన్ ఒడిశా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశా ప్రభుత్వం తొలి నుంచి అభ్యంతరాలు తెలుపుతోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని ఒడిశా వాదిస్తోంది. నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా ఒడిశా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments