Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమి సేల్స్ అదుర్స్.. నాలుగు మిలియన్ ఫోన్లు అమ్ముడుపోయాయ్

దీపావళి పండుగ ఆన్‌లైన్ సంస్థలకు మంచి వ్యాపారం అందించింది. ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునే దిశగా భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో షియోమీతో పాటు పలు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లకు ఆఫర్లు వెల్

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (12:57 IST)
దీపావళి పండుగ ఆన్‌లైన్ సంస్థలకు మంచి వ్యాపారం అందించింది. ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునే దిశగా భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో షియోమీతో పాటు పలు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లకు ఆఫర్లు వెల్లువెత్తాయి. దీపావ‌ళి పండ‌గ సీజ‌న్‌లో దేశ‌వ్యాప్తంగా నాలుగు మిలియ‌న్ల‌కు పైగా షియోమి స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయ‌ని సంస్థ తెలిపింది. 
 
ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ అమ్మకాల్లో షియోమీ బ్రాండ్ నెంబర్ వన్‌గా నిలిచిందని షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ మ‌ను కుమార్ జైన్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయ‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 19 వరకు దివాలీ సేల్స్ పీరియడ్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి. 
 
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డే, అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌ల‌తో పాటు ఇత‌ర స్టోర్ల‌ ద్వారా నాలుగు మిలియ‌న్ల షియోమి ఫోన్లు అమ్ముడుపోయాయని మను కుమార్ చెప్పుకొచ్చారు. ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక స్మార్ట్‌ఫోన్ కంపెనీ తమదేనని.. ఈ సందర్భంగా ఎమ్ఐ ఫ్యాన్సుకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఈ పోస్ట్‌ను షేర్ చేయండి... ఎమ్ఐ ఏ1 ఫోన్ గెలుచుకోండని జైన్ పోస్ట్ తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments