Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2 రోజుల్లో 10 లక్షల స్మార్ట్ ఫోన్స్ సేల్...

దసరా పండుగ సీజన్‌ను చైనా మొబైల్ తయారీ కంపెనీ జియోమీ బాగా క్యాష్ చేసుకుంది. గత రెండు రోజుల్లోనే ఈ కంపెనీకి చెందిన 10 లక్షల స్మార్ట్ ఫోన్లను వినియోగదారులు బుక్ చేసుకున్నారు.

2 రోజుల్లో 10 లక్షల స్మార్ట్ ఫోన్స్ సేల్...
, శనివారం, 23 సెప్టెంబరు 2017 (13:50 IST)
దసరా పండుగ సీజన్‌ను చైనా మొబైల్ తయారీ కంపెనీ జియోమీ బాగా క్యాష్ చేసుకుంది. గత రెండు రోజుల్లోనే ఈ కంపెనీకి చెందిన 10 లక్షల స్మార్ట్ ఫోన్లను వినియోగదారులు బుక్ చేసుకున్నారు. 
 
దసరా ధమాకాను పురస్కరించుకుని ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఇండియాలు మెగా సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ మెగా సేల్‌లో జియోమీ స్మార్ట్‌ఫోన్లు దుమ్మురేపుతున్నాయి. రెండు రోజుల్లో 10 లక్షల షావోమి స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయి. భారీ డిస్కౌంట్‌ ఆఫర్లతో ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఈ సేల్‌ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. 
 
రెండు రోజుల గణాంకాల ప్రకారం, సగటున ప్రతి నిమిషానికి 300కు పైగా స్మార్ట్‌ఫోన్లు అమ్ముడపోయినట్టు జియోమీ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్‌లో విక్రయాలు భారీ ఎత్తున్న పెరిగినట్టు కంపెనీ చెప్పింది. జియోమీకి భారత్ మార్కెట్ అత్యంత కీలకంగా ఉన్న విషయం తెల్సిందే 
 
అలాగే, రెడ్‌మి నోట్‌ 4 స్మార్ట్‌ఫోన్లు హాట్‌కేక్‌లా అమ్ముడుపోతున్నట్టు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్‌ఫోన్‌గా రెడ్‌మి నోట్ ‌4 పేరులోకి వచ్చిన కంపెనీ చెప్పింది. అమెజాన్‌ ఇండియాలో కూడా అమ్ముడుపోతున్న తొమ్మిది స్మార్ట్‌ఫోన్లలో ఎనిమిది జియోమీకి చెందినవి ఉండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీపీ డౌన్... స్పృహతప్పి పడిన భార్య.... ట్రిపుల్ తలాక్ భర్త