Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోవోమి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్.. ఏ సిరీస్ నుంచి చివరి ఫోన్

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (12:25 IST)
Xiaomi Mi A4
షావోమి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ రానుంది. ఎలాంటి కస్టమైజ్డ్‌ యూఐ లేకుండా ప్యూర్‌ ఆండ్రాయిడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కావాలనుకునేవారి కోసం షావోమి ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద 'ఏ' సిరీస్‌ ఫోన్లను తీసుకొస్తోంది. 
 
ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఎంఐ ఏ1, ఏ2, ఏ3 ఫోన్లు వచ్చాయి. తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లు కావడంతో యువతలో వీటికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే, ఇకపై ఈ సిరీస్‌లో ఎలాంటి ఎలాంటి ఫోన్లు రావు. ఇటీవలే ఆ కంపెనీ ఈ విషయాన్ని స్పష్టంచేసింది. అంటే ఏ3నే ఈ సిరీస్‌లో చివరి ఫోన్‌ అన్నమాట.
 
ఈ సిరీస్‌లో ఫోన్లను తీసుకురాకపోవడానికి షావోమి ఎలాంటి కారణాన్ని పేర్కొనలేదు. అయితే, ఈ ఫోన్లకు అప్‌డేట్లు అందించడమొక్కటే ఆ కంపెనీ భారంగా భావిస్తోందని సమాచారం. 
 
ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద మూడేళ్ల పాటు అప్‌డేట్స్‌ అందించాల్సి ఉంటుంది. అందుకే ఇకపై ఈ ఫోన్లను తీసుకురాకుండా తన ఆండ్రాయిడ్‌ ఫోన్లను కస్టమైజ్‌ చేసి ఎంఐయూఐతోనే తీసుకురావాలని భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments