Webdunia - Bharat's app for daily news and videos

Install App

విప్రోకు ఎంత పెద్దమనసు.. రోజుకు 60వేల మందికి ఆహారం

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (11:10 IST)
కరోనా మహమ్మారి ప్రపంచ దేశ ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. దీంతో పలు దేశాలు లాక్ డౌన్‌లో వున్నాయి. ఈ లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు తంటాలు పడుతున్నాయి. ఇలా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం, వైద్య ఖర్చుల కోసం సెలెబ్రిటీలు, ప్రముఖులు సాయం చేస్తున్నారు. ఇలా ఐటీ సంస్థల్లో ఒకటైన విప్రో యాజమాన్యం కూడా కరోనాపై పోరుకు తన వంతు సాయం చేస్తోంది. 
 
ఈ క్రమంలో తమ సంస్థ ప్రతిరోజు 20 లక్షలకు పైగా ప్రజలకు ఆహారాన్ని సరఫరా చేసిందని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సోమవారం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్‌ కష్టాలు పడుతున్న ప్రజలకు అందిస్తున్న ఇతర సంస్థలు తీసుకున్న సహాయక చర్యలను ఆయన ప్రశంసించారు. మహమ్మారితో పోరాడుతున్న దేశానికి అందరూ సహాయ, సహకారాలు అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
విప్రో క్యాంపస్ క్యాంటీన్ల ద్వారా 14-21 రోజులుగా రోజూ 60 వేలకు పైగా ప్రజలకు తాజాగా వండిన భోజనాన్ని, పూర్తిస్థాయి రేషన్ సరుకులను అందజేశామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని ప్రకటించారు.
 
కాగా కోవిడ్ -19 తో పోరాడటానికి అజీమ్ ప్రేమ్‌జీ యాజమాన్యంలోని విప్రో ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఫౌండేషన్ ప్రతిజ్ఞ రూ.1125 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే టాటా గ్రూప్ మొత్తం రూ .1,500 కోట్లను ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments