వాట్సాప్ అకౌంట్లపై సైబర్ అటాక్.. ఎలా జరిగిందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (14:29 IST)
వాట్సాప్ అకౌంట్లపై సైబర్ అటాక్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 20దేశాల్లోని హైప్రొఫైల్ అధికారులే లక్ష్యంగా సైబర్ దాడికి ప్రయత్నించినట్టు వాట్సాప్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా సంయుక్త దేశాలకు సంబంధించిన సీనియర్ ప్రభుత్వ అధికారుల ఫోన్ నెంబర్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌తో నిఘా పెట్టినట్టు సంస్థ గుర్తించింది.
 
వాట్సాప్ సంస్థ ప్రత్యేకించి జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయేల్‌కు చెందిన ఎన్ఎస్ఓ అనే గ్రూపు స్పైవేర్ సాఫ్ట్‌వేర్ టూల్ సాయంతో హైప్రొఫైల్ ప్రభుత్వ అధికారుల వాట్సాప్ అకౌంట్లపై రహస్యంగా నిఘా పెట్టినట్టు వాట్సాప్ ట్రేస్ చేసింది.

మొత్తం 20 దేశాల్లో హై ప్రొఫెల్స్ వున్న ప్రభుత్వ అధికారులు, ఆర్మీ అధికారుల అకౌంట్లను హ్యాకింగ్ చేసి డేటా ఉల్లంఘనకు పాల్పడినట్లు వాట్సాప్ అంతర్గత విచారణలో వెల్లడి అయ్యింది. 
 
ఏప్రిల్ 29, 2019 నుంచి మే 10, 2019 మధ్యకాలంలో వాట్సాప్ యూజర్ల సెల్ ఫోన్ నెంబర్లను వాట్సాప్ సొంత సర్వర్ల నుంచి కనీసం 1,400 మంది యూజర్ల అకౌంట్లను హ్యాకింగ్ చేసి డేటా ఉల్లంఘనకు పాల్పడినందుకు సదరు సంస్థపై యూఎస్ ఫెడరల్ కోర్టులో వాట్సాప్ దావా వేసినట్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purushah Review: భార్యాభర్తల కష్టాలను వినోదాత్మకంగా చెప్పిన పురుషః చిత్రం రివ్యూ-

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

తర్వాతి కథనం
Show comments