Publish Date: Fri, 04 Oct 2019 (11:24 IST)
Updated Date: Fri, 04 Oct 2019 (12:24 IST)
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ అద్భుతమైన ఫీచర్ వాట్సాప్ వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉండనుంది. ఇతరులకు పంపే లేదా మనకు వచ్చే మెసేజ్లో ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలా ఓ ఫీచర్ను వాట్సాప్ యాజమాన్యం తయారు చేస్తోంది.
నిజానికి కుప్పలు తెప్పలుగా ఫోనుకు మెసేజ్లు వస్తుంటాయి. వీటితో ఫోన్ మెమరీ కుంచించుకు పోతుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశా అడుగులు వేస్తోంది వాట్సాప్ యాజమాన్యం. మనం పంపే సందేశాలు నిర్ణీత సమయం తర్వాత మాయమయ్యే సదుపాయాన్ని అభివృద్ధి చేస్తోంది.
ఇప్పటికే మనం పంపే మెసేజ్లను గంట సేపటిలోగా ఎప్పుడైనా డిలీట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆటోమెటిక్గా సందేశాలు డిలీట్ అయ్యేలా వాట్సప్ సంస్థ 'డిసప్పియరింగ్ మెసేజెస్' పేరుతో సరికొత్త ఫీచర్ను అభివృద్ధి చేస్తున్నది.
సెట్టింగ్స్లోకి వెళ్లి మనం మెసేజ్ పంపిన తర్వాత ఐదు సెకండ్ల నుంచి గంటలోపు.. ఎంత సమయంలో అదృశ్యం కావాలో ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలోనే ఉన్నది. ఇప్పుడు గ్రూప్ మెసేజ్లకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. పంపిన సందేశాలు ఆటోమెటిక్గా అదృశ్యమయ్యే ఆప్షన్ ఇప్పటికే జీమెయిల్, టెలిగ్రామ్ చాట్ వంటి యాప్లలో అందుబాటులో తెచ్చిన విషయం తెల్సిందే.
ఠాగూర్
Publish Date: Fri, 04 Oct 2019 (11:24 IST)
Updated Date: Fri, 04 Oct 2019 (12:24 IST)