ఇకపై వాట్సాప్ ద్వారా పేమెంట్స్... త్వరలోనే న్యూ ఫీచర్లు

Webdunia
ఆదివారం, 3 నవంబరు 2019 (15:42 IST)
సోషల్ మీడియా నెట్‌వర్క్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. యూపీఐ ఆధారిత చెల్లింపు సేవల కోసం వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. 
 
వాస్తవానికి ఇప్పటికే ఈ ప్రాజెక్టును కొన్ని నెలల కిందటే ప్రారంభించారు. ఇపుడు దీన్ని మరింత అభివృద్ధి పరిచి త్వరలోనే అధికారికంగా రిలీజ్ చేస్తారు. ఈ ప్రక్రియకు ముందే వాట్సాప్ ఆర్బీఐ అనుమతి పొందాల్సి ఉంటుంది.
 
అంతేకాకుండా, గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కూడా మరో ఫీచర్ జోడిస్తున్నారు. గ్రూపులో చేరాల్సిందిగా అభ్యర్థన పంపేవారిని బ్లాక్ లిస్ట్ సాయంతో బ్లాక్ చేయొచ్చు. ఈ గ్రూప్ బ్లాక్ లిస్ట్ ఫీచర్‌ను మొదట ఐఫోన్ యూజర్లకు విడుదల చేస్తారు.
 
ముఖ్యంగా, ఒకేసారి అనేక డివైస్‌లలో లాగిన్ అయ్యేందుకు వీలు కల్పించే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలోనే ఆవిష్కరించనుంది. ఇప్పటివరకు ఒక డివైస్‌లో వాట్సాప్ లాగిన్ అయివున్నప్పుడు మరో డివైస్‌లో లాగిన్ అయితే, ముందు లాగిన్ అయిన డివైస్‌లో వాట్సాప్ లాగ్ అవుట్ అవుతుంది. 
 
ఇప్పుడు ప్రవేశపెడుతున్న సరికొత్త ఫీచర్ ద్వారా ఒకరు ఎన్ని డివైస్‌లలో అయినా వాట్సాప్‌ను యాక్సెస్ చేసే వీలు కలుగుతుంది. అంతేకాదు, ఐపాడ్‌లలోనూ వాట్సాప్ అందుబాటులోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments