Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచాయ్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతోందా?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:48 IST)
ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు ప్రస్తుత సిఈఓ సుందర్ పిచాయ్ మన భారతీయుడు. గూగుల్ యాజమాన్యం మాత్రం అనేకమందిని, అనేక రకాలుగా పరీక్షించి ఏరికోరి మరీ పిచాయ్‌ను సిఈఓగా నియమించింది. అయితే ఇప్పుడు ఈ భారతీయ నాయకుడిపై నమ్మకం సన్నగిల్లుతోందట. అయితే ఆ అపనమ్మకం వేరే ఎవరికో కాదు గూగుల్ ఉద్యోగులకేనట.
 
వివరాల్లోకి వెళితే గూగుల్ సంస్థ ప్రతి ఏడాది అనేక అంశాలపై తమ సంస్థలోని ఉద్యోగుల అభిప్రాయాలను సేకరిస్తుంది. దీని కోసం గూగులెగిస్ట్ పేరుతో వార్షిక పోల్‌ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది సుందర్ పిచాయ్ పనితీరు గురించి ఆయన నాయకత్వంలో సంస్థ మరింత ముందుకు వెళ్తుందా అన్న ప్రశ్నకు 78 శాతం మంది అవును అని తెలిపారు, అయితే ఇదే ప్రశ్నకు గతేడాది 88 శాతం మంది అనుకూలంగా ఓటువేసారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 10 శాతం ఉద్యోగుల్లో పిచాయ్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లినట్లు సమాచారం.
 
పిచాయ్ తీసుకునే నిర్ణయాలు వ్యూహాలు ఎంతమేరకు ఉపయోగపడుతున్నాయనే దానికి బదులుగా 75 శాతం మంది అనుకూలంగా స్పందించారు... అయితే గతేడాదితో పోల్చితే ఈ విషయంలో కూడా 13 శాతం మంది అపనమ్మకాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. రోజురోజుకీ తనపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో పిచాయ్ తన సంస్థ భవిష్యత్తు కోసం ఏవైనా సంస్కరణలు చేపడతాడో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments