మొబైల్ వినియోగదారుల మరో షాక్... ఏంటది?

Webdunia
ఆదివారం, 24 నవంబరు 2019 (17:24 IST)
డిసెంబర్ నుంచి ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు తమ టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు ప్రకటించాయి. తాజాగా జియో కూడా టారిఫ్ రేట్లను పెంచాలని అనుకుంటోంది. ధరల పెరుగుదల అవసరమని భావిస్తే తాము కూడా రేట్లు పెంచుతామని జియో తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలని మూడు నెలల్లోగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో టెలికాం సంస్థలు రేట్లను పెంచేందుకు సిద్ధమయ్యాయి.
 
డెక్కన్ హెరాల్డ్ నుంచి వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం, ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్, ఐడియా సంస్థలు అన్ని రీఛార్జ్ ప్లాన్లపై అదనంగా 20 శాతం పెంచే అవకాశముంది. టెలికాం సంస్థలకు చెందిన వివిధ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయని ఆ రిపోర్టులో తెలిపింది. అయితే, ధరల పెరుగుదల ఆయా రీఛార్జ్ ప్లాన్‌ల ధరపై ఆధారపడి ఉంటుంది. కనీస రీఛార్జ్ ప్లాన్‌లకు తక్కువ పెంపు, ఎక్స్‌పెన్సివ్ రీఛార్జ్ ప్లాన్‌లకు కాస్త ఎక్కువ మొత్తంలో రేట్లు పెంచుతాయని రిపోర్ట్ తెలిపింది.
 
ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయుసి) వల్ల కలిగే నష్టాలను భరించలేక రిలయన్స్ జియో ఇటీవలే తన కస్టమర్లకు ఓ షాక్ ఇచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకు అవుట్ గోయింగ్ కాల్స్ కోసం నిమిషానికి 6 పైసలు వసూలు చేయడం ప్రారంభించింది. అయితే జియో-టు-జియో కాల్స్ మాత్రం ఉచితం. జియో కస్టమర్లు దాని సేవలను ఉపయోగించటానికి కనీసం 10 రూపాయలు అదనంగా చెల్లించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: తాజా న్యూస్... నందమూరి బాలక్రిష్ణ, మలినేని గోపీచంద్ సినిమా కథ మారిందా ?

మరోమారు ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధమైన సోనూసూద్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments