Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఫోన్‌ను ట్రోల్ చేసిన శామ్‌సంగ్.. లక్షలు పెట్టి ఫోన్‌ కొంటే ఛార్జర్ ఇవ్వరా?

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (12:42 IST)
Iphone
ఐఫోన్‌ను శామ్‌సంగ్ ట్రోల్ చేసింది. ఐఫోన్ 12 సిరీస్‌ను ఇటీవలే యాపిల్ సంస్థ ప్రకటించింది. దీని ధరలు ఎప్పటిలాగే ఆకాశాన్ని తాకాయి. అయితే ఓ విషయంపై మాత్రం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అదేమిటంటే ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ ఫోన్‌ను కొన్నవారికి ఛార్జర్ ఇవ్వకపోవడమే. లక్ష రూపాయలు మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఛార్జర్ ఇవ్వకపోవడం ఏమిటని శామ్‌సంగ్ ప్రశ్నించింది. 
 
యాపిల్ ఫోన్‌ను కొనడమే కాకుండా మళ్లీ ఛార్జర్ కొండమేమిటని నెటిజన్లు యాపిల్ సంస్థను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో యాపిల్ ను ట్రోల్ చేస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు.
 
శాంసంగ్.. యాపిల్ సంస్థకు రైవల్ అన్న సంగతి తెలిసిందే. తన తాజా పోస్టులో యాపిల్ కంపెనీని ట్రోల్ చేస్తూ పోస్టు పెట్టింది. 'మీ గెలాక్సీ.. మీరు ఏది కోరుకుంటున్నారో అది ఇస్తుంది.. ఛార్జర్, బెస్ట్ కెమెరా, బ్యాటరీ, పెర్ఫార్మన్స్, 120 హెడ్జెస్ స్క్రీన్' అంటూ ఫేస్ బుక్‌లో పోస్టు చేసింది. 
 
ముఖ్యంగా నలుపు రంగు ఉన్న ఛార్జర్ ఫోటోను పోస్టు చేసి తాము ఛార్జర్ ఇస్తామని తెలిపింది. ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 70వేలకు పైగా రియాక్షన్లు వచ్చాయి, 10000కు పైగా కామెంట్లు చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments