మొబైల్ తయారీదారు సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎ10ఎస్ పేరిట సరికొత్త స్మార్ట్ఫోన్ను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో వివిధ కంపెనీల నుండి పోటీ తలెత్తిన నేపథ్యంలో శాంసంగ్ సంస్థ కూడా రోజురోజుకీ కొత్త ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది.
గెలాక్సీ ఎ10ఎస్ ఫోన్కు సంబంధించి 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,499 ఉండగా, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,499గా ఉంది. ఇందులో డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్లు, 4000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందిస్తున్నారు.