Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రిలయన్స్ వార్షిక సమావేశం... భారీ వరాలు...

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (11:12 IST)
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రియలన్స్ 42వ వార్షిక సమావేశం సోమవారం జరుగనుంది. ఈ సమావేశంలో మరోమారు భారీగా వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా, రిలయన్స్ జియో సేవలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో ఇపుడు కొత్తగా జియో గిగాఫైబర్, గిగా టీవీ సర్వీస్, జియో ఫోన్3లను ఈ సమావేశంలో ఆవిష్కరించవచ్చని తెలుస్తోంది. 
 
గతంలో ఈ సమావేశాల్లో భాగంగానే జియో సిమ్‌ను, జియో ఫోన్‌ను ముఖేష్ విడుదల చేశారు. జియో సిమ్ సర్వీసులు టెలికాం రంగంలో పెను సంచలనాన్నే రేపాయి. అప్పటివరకూ వెలుగొందిన ఎయిర్‌టెల్, ఐడియా వంటి దిగ్గజ టెలికాం కంపెనీలు జియో ప్రభావంతో కుదేలయ్యాయి.
 
అతి తక్కువ ధరలకే ఫ్రీ వాయిస్ కాల్స్, డేటా ప్లాన్స్‌ను జియో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. టెలికాం రంగంలో పెను సంచలనాన్ని సృష్టించిన జియో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఏ ప్రకటన రాబోతోందా అని సామాన్య ప్రజలతో పాటు బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments