Webdunia - Bharat's app for daily news and videos

Install App

చౌక ధరలో రెడ్ మీ ఫోన్లు... ఆగస్టు 31 నుంచి అమ్మకాలు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:28 IST)
Redmi 9
భారత మార్కెట్లోకి చౌక ధరలో రెడ్ మీ ఫోన్లు విడుదలయ్యాయి. రెడ్‌మీ 9 పేరుతో కొత్త మోడల్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి సదరు సంస్థ విడుదల చేసింది. మొత్తం రెండు వేరింయంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. 
 
4జీబీ/64జీబీ అంతర్గత మొమరీ వేరియంట్ ధర రూ. 8,999గా, 4జీబీ/128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 9,999గాను సంస్థ నిర్ణయించింది. ఆగస్టు 31 నుంచి ఎంఐ.కామ్‌, అమెజాన్‌లలో రెడ్‌మీ 9 అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కార్బన్‌ బ్లాక్‌, స్కై బ్లూ, స్పోర్టీ ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.
 
ఇకపోతే.. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.53 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డాట్‌వ్యూ డిస్‌ప్లేను ఇది కలిగివుంటుంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్ హీలియో జీ35 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌‌తో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. వెనుక రెండు, ముందు ఒకటి అమర్చారు. 
 
వెనకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, డెప్త్‌ సెన్సార్‌తో 2 ఎంపీ కెమెరా ఉంటాయి. ముందు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 10వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని రెడ్ మీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments