Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత మార్కెట్లోకి నోకియా కొత్త స్మార్ట్ ఫోన్లు.. ఒకటి కాదు.. ఏకంగా నాలుగు

భారత మార్కెట్లోకి నోకియా కొత్త స్మార్ట్ ఫోన్లు.. ఒకటి కాదు.. ఏకంగా నాలుగు
, బుధవారం, 26 ఆగస్టు 2020 (10:43 IST)
Nokia
నోకియా దూకుడును పెంచింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌కు చెందిన నోకియా భారత మార్కెట్లో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది. బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, ఎంట్రీ లెవల్ నోకియా సీ 3,  రెండు ఫీచర్ ఫోన్‌లు నోకియా 125, నోకియా 150లను ఆవిష్కరించింది. 5.1కి  కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది.
 
నోకియా 5.3.. 5.3 స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌‌తో 6.55-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగివుంటుంది. అలాగే 4జీబీ ర్యామ్  64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్,  64 జీబీ స్టోరేజ్‌లతో ఇది లభ్యమవుతుంది. అలాగే 13+ 5+2 +2ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీలను ఈ ఫోను కలిగివుంటుంది.
 
అలాగే 4 జీబీ ర్యామ్‌ బేస్ వేరియంట్‌కు రూ .13,999, 6 జీబీ ర్యామ్‌ మోడల్‌కు రూ .15,499 అని నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని నోకియా ఓ ప్రకటనలో తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు చంపేస్తారనీ.. దళిత యువకుడి ఆత్మహత్య...