Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతులకు శుభవార్త: మంత్రి బొత్స సత్యనారాయణ

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:04 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అద్దె రైతులకు శుభవార్త తెలిపింది. వార్షిక లీజు మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రూ.158 కోట్లలో రూ.9.73 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. ఈ డబ్బును త్వరలో రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి హామీ ఇచ్చారు.
 
అంతకుముందు అమరావతి రైతులు మహిళలు బుధవారం సిఆర్డిఎ కార్యాలయంలో ధర్నా నిర్వహించడానికి ప్రయత్నించారు. తమకు చెల్లించని లీజు మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండు చేశారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించి రైతులకు నిన్ననే కౌలు చెల్లించామని అయితే సాంకేతిక కారణాల వల్ల అది జాప్యం జరిగిందని తెలిపారు. త్వరలోనే డబ్బులను చెల్లిస్తామని స్పష్టత ఇచ్చారు.
 
అమరావతి రైతులకు పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించామని అయితే ప్రతిపక్షాలు కేసులు వేయడం వల్ల అది సాధ్యపడలేదని తెలిపారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని, ప్రజా సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments