అమరావతి రైతులకు శుభవార్త: మంత్రి బొత్స సత్యనారాయణ

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:04 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అద్దె రైతులకు శుభవార్త తెలిపింది. వార్షిక లీజు మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రూ.158 కోట్లలో రూ.9.73 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. ఈ డబ్బును త్వరలో రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి హామీ ఇచ్చారు.
 
అంతకుముందు అమరావతి రైతులు మహిళలు బుధవారం సిఆర్డిఎ కార్యాలయంలో ధర్నా నిర్వహించడానికి ప్రయత్నించారు. తమకు చెల్లించని లీజు మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండు చేశారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించి రైతులకు నిన్ననే కౌలు చెల్లించామని అయితే సాంకేతిక కారణాల వల్ల అది జాప్యం జరిగిందని తెలిపారు. త్వరలోనే డబ్బులను చెల్లిస్తామని స్పష్టత ఇచ్చారు.
 
అమరావతి రైతులకు పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించామని అయితే ప్రతిపక్షాలు కేసులు వేయడం వల్ల అది సాధ్యపడలేదని తెలిపారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని, ప్రజా సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments