Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేబులో పేలిన ఒప్పో స్మార్ట్ ఫోన్... కేసు నమోదు!

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (12:03 IST)
స్మార్ట్ ఫోన్... చూడడానికి ఎంత స్మార్ట్‌గా ఉంటున్నాయో... కాస్త తేడా వస్తే అంతే స్మార్ట్‌గా ముంచేస్తున్నాయనేది కూడా నిజమేనంటున్నారు వినియోగదారులు. మొబైల్ రేడియేషన్‌లు, వాటి ప్రభావాలు ఒక ఎత్తయితే... మనం జేబులో పెట్టుకున్న ఫోన్ ఎప్పుడు కొంప ముంచుతుందోనని సగటు వినియోగదారుడు భయపడుతున్నాడు. తాజాగా అలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
 
వివరాలలోకి వెళ్తే... అల్వాల్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అరటి పళ్ల వ్యాపారం చేసుకుంటూ... ఎంతో ముచ్చటపడి రెండు రోజుల క్రితం ఒప్పో కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేసాడు. ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు రాసి వస్తున్న తన బంధువుల అమ్మాయిని తిరిగి తీసుకువస్తున్న సమయంలో ఫ్యాంట్ జేబులో పెట్టుకున్న ఫోన్ ఒక్కసారిగా పేలడం జరిగింది. 
 
దీంతో అతను బైక్ పైనుంచి పడిపోగా, తలకు కూడా గాయమైంది. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. స్మార్ట్ ఫోన్ ప్యాంట్ జేబులో ఉండబట్టి, తొడకు తీవ్రగాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు గానీ, అదే షర్ట్ జేబులో ఉండుంటే ప్రాణాలే పోయేవి. కాగా... బాధితుడు ఇమ్రాన్ ఒప్పో కంపెనీపై బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇక్కడ గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments