జేబులో పేలిన ఒప్పో స్మార్ట్ ఫోన్... కేసు నమోదు!

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (12:03 IST)
స్మార్ట్ ఫోన్... చూడడానికి ఎంత స్మార్ట్‌గా ఉంటున్నాయో... కాస్త తేడా వస్తే అంతే స్మార్ట్‌గా ముంచేస్తున్నాయనేది కూడా నిజమేనంటున్నారు వినియోగదారులు. మొబైల్ రేడియేషన్‌లు, వాటి ప్రభావాలు ఒక ఎత్తయితే... మనం జేబులో పెట్టుకున్న ఫోన్ ఎప్పుడు కొంప ముంచుతుందోనని సగటు వినియోగదారుడు భయపడుతున్నాడు. తాజాగా అలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
 
వివరాలలోకి వెళ్తే... అల్వాల్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అరటి పళ్ల వ్యాపారం చేసుకుంటూ... ఎంతో ముచ్చటపడి రెండు రోజుల క్రితం ఒప్పో కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేసాడు. ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు రాసి వస్తున్న తన బంధువుల అమ్మాయిని తిరిగి తీసుకువస్తున్న సమయంలో ఫ్యాంట్ జేబులో పెట్టుకున్న ఫోన్ ఒక్కసారిగా పేలడం జరిగింది. 
 
దీంతో అతను బైక్ పైనుంచి పడిపోగా, తలకు కూడా గాయమైంది. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. స్మార్ట్ ఫోన్ ప్యాంట్ జేబులో ఉండబట్టి, తొడకు తీవ్రగాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు గానీ, అదే షర్ట్ జేబులో ఉండుంటే ప్రాణాలే పోయేవి. కాగా... బాధితుడు ఇమ్రాన్ ఒప్పో కంపెనీపై బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇక్కడ గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

తర్వాతి కథనం
Show comments