Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండో భార్య కుమార్తెపై అత్యాచారం చేసిన మారుతండ్రి

Advertiesment
Hyderabad
, మంగళవారం, 26 మార్చి 2019 (11:08 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. రెండో భార్య కుమార్తెపై మారుతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోల్కొండ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి (45) ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. 
 
ఆమెకు మొదటి భర్తతో పుట్టిన కుమార్తె(13) నగరంలో ఓ ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వెళ్లిన బాలికపై మారు తండ్రి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత విషయం బయటకు చెబితే మీ అమ్మతో పాటు నిన్నుకూడా చంపేస్తానని బెదిరించాడు. కానీ ఆ యువతి ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. 
 
ఈ విషయం ఇరుగుపొరుగువారి ద్వారా బాలల హక్కుల సంఘానికి తెలిసింది. దీంతో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించి గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ కొమరయ్యకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్చూరు పోరు : దగ్గుబాటి వెంకటేశ్వర రావు వర్సెస్ దగ్గుబాటి వెంకటేశ్వర్లు