Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌లో 'మీటూ' ప్రకంపనలు... 48 మంది ఉద్యోగులుపై వేటు

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (09:17 IST)
మీటూ ఉద్యమం దిగ్గజ టెక్ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు చేరింది. ఈ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించినందుకు 48 మంది ఉద్యోగులపై ఆ సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ వేటు వేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.
 
గూగుల్ సంస్థలో గడచిన రెండేళ్లలో లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను తొలగించామని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ మేరకు సుందర్ పిచాయ్ ఫాక్స్ న్యూస్‌కు ఈ మెయిల్ పంపించారు. 
 
లైంగిక వేధింపులకు పాల్పడిన 13మంది సీనియర్ మేనేజర్లను కంపెనీ తొలగించిందని పిచాయ్ అందులో పేర్కొన్నారు. గూగుల్‌లో ఎవరైనా ఉద్యోగినులు తమకు ఎదురైన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే వారికి తాము మద్దతుగా నిలుస్తామని చెప్పారు.
 
పనిప్రదేశంలో ఉద్యోగినిలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు గూగుల్ కట్టుబడి ఉందని ఆ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ మెయిల్‌లో గూగుల్ ఆపరేషన్స్ ఉపాధ్యక్షుడు ఇలీన్ నౌగటన్ సంతకం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం