Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్, పాన్ అనుసంధానానికి 31వ చివరి తేదీ.. అలా చేయించకపోతే పాన్..?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (15:27 IST)
ఆధార్, పాన్ అనుసంధానానికి చివరి తేదీ ఈ నెల 31. ఈ గడువులోగా వీటిని అనుసంధానం చేయించకపోతే పాన్ చెల్లదు. అంతేకాకుండా రూ.1,000 వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. లోక్‌సభ మంగళవారం ఆమోదించిన ఆర్థిక బిల్లు, 2021లో ఈ నిబంధనలు ఉన్నాయి. 
 
ఫైనాన్స్ బిల్లులోని సెక్షన్ 139ఏఏ(2) ప్రకారం ఆధార్‌ సంఖ్యను తెలియజేయాలని ఏ వ్యక్తినైనా కోరినపుడు, ఆ వ్యక్తి ఆ విధంగా తన ఆధార్ సంఖ్యను తెలియజేయడంలో విఫలమైతే, గరిష్ఠంగా రూ.1,000 వరకు రుసుమును చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా రుసుమును విధించేందుకు అవకాశం కల్పిస్తూ ఈ బిల్లులో సెక్షన్ 234హెచ్‌ను కొత్తగా ప్రవేశపెట్టారు. 
 
మార్చి 31నాటికి ఆధార్, పాన్‌లను తప్పనిసరిగా అనుసంధానం చేయించుకోవాలి. ఆధార్‌ను మెయింటెయిన్ చేయకపోతే పాన్ పని చేయదు. ఫలితంగా ఎదుర్కొనవలసిన పర్యవసానాలకు అదనంగా ఈ రుసుమును చెల్లించాలి. రూల్ 114ఏఏఏ ప్రకారం, పాన్‌ను తెలియజేయాలని ఏ వ్యక్తినైనా అధికారులు కోరినపుడు, ఆ వ్యక్తి పాన్ పనిచేయని స్థితిలో ఉంటే, ఆ వ్యక్తి తన పాన్‌ను సమర్పించలేదని పరిగణిస్తారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments