Webdunia - Bharat's app for daily news and videos

Install App

''జియోఫై'' వినియోగదారుల కోసం రిలయన్స్ బంపర్ ఆఫర్

దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా కొత్త ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. జియో తన ''జియోఫై'' డివైస్ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.1999కి జియోఫై ప

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (18:50 IST)
దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా కొత్త ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. జియో తన ''జియోఫై'' డివైస్ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.1999కి జియోఫై పరికరాన్ని కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.3,595 విలువతో కూడిన ప్రయోజనాలను అందిస్తున్నట్లు తెలిపింది. 
 
ఈ ఆఫర్‌లో భాగంగా రోజుకు 1.5జీబీ లేదా 2జీబీ లేదా 3జీబీ డేటా ప్లాన్లను ఎంపిక చేసుకునే అవకాశం వుంటుందని రిలయన్స్ జియో తెలిపింది. అలాగే.. ఈ ఆఫర్ కింద రూ.1,295 డేటా రూపంలో లభిస్తుంది. మిగతా రూ.2,300 వోచర్ల రూపంలో లభిస్తాయని.. వీటిని పేటీఎం, ఏజీయో, రిలయన్స్ డిజిటల్ షాపింగ్‌ల్లో ఉపయోగించుకోవచ్చునని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
మరోవైపు రిలయన్స్ జియో తమ ప్రైమ్ మెంబర్ల కోసం మోర్ దాన్ వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ గడువును మార్చి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇందులో వినియోగదారులకు రూ.700 వరకు విలువైన క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కానీ వినియోగదారులు రూ.398 లేదా ఆపై విలువ గల ప్లాన్లను రీఛార్జ్ చేసుకుంటే.. 100 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments