Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.600లకే ఇంటర్నెట్, టీవీ, ల్యాండ్‌లైన్.. జియో గిగా ఫైబర్ ఆఫర్

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (12:26 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో.. మిగిలిన టెలికాం రంగాలకు చెందిన సంస్థల్ని గట్టిదెబ్బ కొట్టింది. కేవలం రూ.600లకే ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు చుక్కలు చూపించింది. రూ.600లకే ఇంటర్నెట్, ల్యాండ్ లైన్, టీవీ సెటాప్ బాక్సులను అందించే ఆఫర్‌ను జియో ప్రవేశపెట్టడం ద్వారా మిగిలిన టెలికాం రంగ సంస్థలకు కళ్లు బయర్లు కమ్మాయి. 

గత 2018వ సంవత్సరం నుంచి జియో గిగా ఫైబర్ సేవలు ప్రారంభమయ్యాయి. జియో గిగా ఫైబర్ ఆఫర్‌ను పొందాలంటే ముందుగా రూ.4,500లను డిపాజిట్‌గా చెల్లించాలి. ఆపై చెల్లించే నెలసరి చెల్లింపుకు తగినట్లు ఇంటర్నెట్ సేవలను అందిస్తారు. అయితే ప్రస్తుతం జియో సంస్థ రూ.600లకే ఇంటర్నెట్, ల్యాండ్ లైన్, టీవీ సెటాప్ బాక్స్ సేవలను అందించనుంది.
అంతేగాకుండా రూ.1,000లను అదనంగా చెల్లిస్తే.. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ అనే 40 గ్యాడ్జెట్లను పొందవచ్చు. జియో నుంచి లభించే ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులకు భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. కానీ ఇతర టెలికాం సంస్థలకు మాత్రం జియో ఆఫర్ కాస్త గుదిబండలా మారింది. దీంతో ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి సంస్థలకు షాక్ తగిలింది. ఫలితంగా తమ వినియోగదారులను కాపాడుకునేందుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలు మల్లాగుల్లాలు పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments