Webdunia - Bharat's app for daily news and videos

Install App

2జీ కాలంలో దేశం ఓ దశాబ్దం వెనకబడింది... 6జీ సేవలు వచ్చేస్తున్నాయ్!

Webdunia
బుధవారం, 18 మే 2022 (17:34 IST)
2జీ కాలంలో అవినీతి వల్ల దేశం ఓ దశాబ్దం వెనకబడిందని పరోక్షంగా కాంగ్రెస్​ను విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. ట్రాయ్​ సిల్వర్​ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక 3జీ నుంచి దేశాన్ని 4జీలోకి నడిపించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు 5జీ లోకి అడుగుపెట్టామని, ఇది దేశాన్ని అభివృద్ధిబాటలో పరుగులు పెట్టిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
 
పరిపాలనలో కూడా 5జీ టెక్నాలజీ మంచి మార్పులు తీసుకొస్తుందని, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య తదితర రంగాల అభివృద్ధికి తోడ్పడుతుందని మోడీ వివరించారు. 5జీ టెక్నాలజీతో దేశ ఆర్థిక వ్యవస్థకు 45 వేల కోట్ల డాలర్ల సహకారం అందుతుందని ప్రధాని తెలిపారు. 
 
ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ సేవలు ప్రారంభించాలని కోరుకుంటున్నామని, ఇప్పటికే దానికోసం ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​పాల్గొన్నారు. ట్రాయ్​ సిల్వర్​ జూబ్లీ వేడుకల్లో భాగంగా పోస్టల్​ స్టాంప్​ను విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments