Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌లో పురుషులు అధికంగా దేన్ని సర్చ్ చేశారంటే...?

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (16:15 IST)
సెర్చింజన్ గూగుల్‌లో ఏది పడితే వెతికేస్తూ వుంటాం. ప్రతి సందేహానికి గూగుల్​ టక్కున సమాధానం ఇచ్చేస్తుంది. అలా ఈ గూగుల్‌ను మంచి కోసం ఉపయోగించుకునే వాళ్లు వున్నారు. చెడు కోసం ఉపయోగించుకునే వాళ్లూ వున్నారు. ఎందుకంటే.. గతేడాది కరోనా వైరస్​ విజృంభనతో భారత్​తో సహా అనేక దేశాలు లాక్​డౌన్​ విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. 
 
కంపెనీలన్నీ వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ప్రకటించాయి. ఇక విద్యాభోదన ఆన్​లైన్​కు మారింది. ఈ సమయంలో ప్రజలు గూగుల్​లో ఎలాంటి విషయాలను వెతికారనే దానిపై న్యూజిలాండ్‌లోని ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్​ఫ్లిక్ట్ స్టడీస్‌ అధ్యయనం నిర్వహిచింది. ఇందులో భార్యలపై ఎలా పైచేయి సాధించాలని ఎక్కువమంది మగవాళ్లు గూగుల్‌లో వెతికినట్టు సర్వే గుర్తించింది. వారి అధ్యయనంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి.
 
లాక్​ డౌన్ సమయంలో​ ప్రపంచవ్యాప్తంగా గృహహింస గణనీయంగా పెరిగిందన్న ఆందోళనకరమైన అంశం బయటపడింది. సుదీర్ఘ లాక్​డౌన్​ కారణంగా ప్రజలు ఇళ్లలో బంధీలుగా మారడంతో వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ముఖ్యంగా పురుషుల్లో పెరిగిన ఫ్రస్టేషన్​ ఎవరి మీద చూపించాలో తెలియక తమ భార్యలపై చూపించారని, ఫలితంగా మహిళలపై హింస గరిష్ట స్థాయికి చేరుకుందని అధ్యయనం వెల్లడించింది.  
 
లాక్​డౌన్​ సమయంలో చాలా మంది పురుషులు 'భార్యను అదుపులో పెట్టడం ఎలా?'.. 'ఎవ్వరికీ తెలియకుండా భార్యను ఎలా కొట్టాలి?' అనే విషయాలను గూగుల్​లో 16.50 కోట్ల సార్లు సెర్చ్​ చేశారని అధ్యయనంలో తేలింది. 
 
అదేవిధంగా "భార్యను ఇంట్లోనే ఎలా చంపాలి?" అనే విషయాన్ని 17.80 కోట్ల సార్లు స్టెర్చ్​ చేశారని అధ్యయనంలో తేలింది. ఇక, భర్తల హింస తట్టుకోలేక భార్యలు "నా భర్త నన్ను చంపేస్తాడు" అని 10.7 కోట్ల సార్లు, 'నన్ను కొడతాడు' అని 32 కోట్ల సార్లు గూగుల్​లో సెర్చ్​ చేశారని తేలింది. "దయచేసి నాకు సహాయం చెయ్యండి" అని అనేక మంది మహిళలు 1.22 బిలియన్ సార్లు గూగుల్​లో వెతికారని అధ్యయనం పేర్కొంది.
 
ఈ డేటాను సేకరించిన విధానాన్ని కాటెరినా అనే అధ్యయన కర్త వివరించారు. 'కరోనా లాక్​డౌన్​ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితమవ్వడంతో, తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక, గూగుల్​ను ఆశ్రయించారు. 
 
అసలు ఈ లాక్​డౌన్​ సమయంలో ప్రజలు ఎలాంటి విషయాలను సెర్చ్​ చేశారో తెలుసుకోవడానికి ఈ అధ్యయనం నిర్వహించాను. నా అధ్యయనంలో మహిళలు గృహ హింస ఎదుర్కొన్నారనే ఆందోళనకరమైన అంశం బయటపడింది' అని ఆమె చెప్పారు. భారత్‌లో కూడా లాక్‌డౌన్ సమయంలో ఎక్కువ గృహ హింస కేసులు నమోదైన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chay and Samantha Divorce: సమంత- చైతూల విడాకులకు కారణం ఏంటంటే?

వ్యాపారవేత్తను పెళ్లాడనున్న అల్లు అర్జున్ హీరోయిన్

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు - పరారీలో మలయాళ సినీ నటి

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments