Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మతి స్థిమితం లేని వృద్ధురాలి దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి?

మతి స్థిమితం లేని వృద్ధురాలి దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి?
, మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (22:36 IST)
మతి స్థిమితం లేని ఓ గిరిజన వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన విషాద సంఘటన మంగళవారం జిల్లాలోని గార్ల మండలంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం గార్ల మండల శివారులోని డబ్బాల మోరి వద్ద దిగువ రైల్వే ట్రాక్‌ మధ్యలో ఉదయం సుమారు 65 ఏళ్లున్న వృద్ధురాలి మృతదేహం ముక్కలుముక్కలుగా పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
 
ఘటనపై పోలీసులు ఆరా తీసి ఆమెను ఖమ్మం జిల్లా కారేపల్లి(సింగరేణి) మండల పరిధి బద్యాతండావాసిగా గుర్తించారు. కాగా మృతురాలు తనను కుమారులు పట్టించుకోవడం లేదని, తనది కారెపల్లి అని చెబుతూ మూడు రోజులుగా ట్రాక్‌ వెంట తిరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 11-12గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చంపి, శరీర భాగాలను ముక్కలుగా చేసి గోనె సంచిలో మొండెం భాగాన్ని తెచ్చి ట్రాక్‌ మధ్యలో వదిలి వెళ్లారు.
 
మృతురాలికి ముగ్గురు కుమారులుండగా భర్త ఇదివరకే చనిపోయాడు. రైల్వే డీఎస్పీ చంద్రభాను, ఖమ్మం రైల్వే ఎస్సై రవికుమార్‌ ఆదేశాల మేరకు డోర్నకల్‌ రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ ఆళ్ల సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియా- ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతాల కోసం స్టెల్లాంటిస్‌ ముఖ్యమైన నాయకత్వ బృంద నియామకాలు