Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్‌పై షర్మిల సెటైర్లు-కాంట్రాక్టు కాదు దొర.. పర్మినెంట్ రిక్రూట్‌మెంట్ చెయ్

కేసీఆర్‌పై షర్మిల సెటైర్లు-కాంట్రాక్టు కాదు దొర.. పర్మినెంట్ రిక్రూట్‌మెంట్ చెయ్
, సోమవారం, 26 ఏప్రియల్ 2021 (17:20 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సోషల్ మీడియా వేదిక నిలదీశారు వైఎస్ షర్మిల.. కరోనా వైద్యం కోసం ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను భర్తీ చేయడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ట్విట్టర్‌లో స్పందించిన ఆమె.. కాంట్రాక్టు కాదు దొర.. పర్మినెంట్ రిక్రూట్‌మెంట్ చెయ్ అంటూ తెలంగాణ యాసలో కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. 
 
755 అంటూ కొసరకు కేసీఆర్ దొర... హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న 23,512 ఖాళీ పోస్టులను నింపు జర అని వ్యాఖ్యానించిన ఆమె.. అలా చేస్తే.. నిరుద్యోగుల చావులను కొంతమేరకైనా ఆపవచ్చు అని సలహా ఇచ్చారు.
 
కాగా, తెలంగాణలో వెంటనే 1.91లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్షకు చేసిన సంగతి తెలిసిందే.. ఇక, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆది నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు షర్మిల.
 
ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల సెటైర్లు వేస్తున్నారు. కోవిడ్ టైంలో ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె ఎత్తిచూపిస్తున్నారు. తెలంగాణలో వెంటనే 1.9 1లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఉద్యోగ దీక్షకు దిగిన షర్మిల.. తన అనుచరులు కోవిడ్ బారిన పడటంతో ప్రజాసమస్యలపై పోరుకు కాస్త గ్యాప్ తీసుకున్నారు.
 
అయితే తెలంగాణ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సందించేందుకు తాను ట్విట్టర్‌ను వేదికగా ఎంచుకున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు. ''రోజురోజుకు తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దొర కేసీఆర్‌కు పట్టింపు లేదు. సిబ్బంది కొరతతో వైద్యారోగ్యశాఖ ఇబ్బంది పడుతుంటే సారుకు కనపడటం లేదు'' అంటూ తెలంగాణ యాసలో ట్వీట్ చేశారు. 
 
హెల్త్ డిపార్ట్ మెంట్‌లో ఉన్న 23512 ఖాళీపోస్ట్‌లను నింపు జర అంటూ నిరుద్యోగానికి షర్మిల లింక్ పెట్టారు. అవి నింపితే ప్రజల ప్రాణాలతో పాటూ నిరుద్యోగులు సైతం ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారంటూ కేసీఆర్‌కు షర్మిల ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ సోకిందని భార్యనే కడతేర్చాడు.. తలను శరీరం నుంచి వేరు చేశాడు..