చేదువార్త చెప్పిన గూగుల్ ప్లే.. వచ్చే యేడాది నుంచి...

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (07:43 IST)
ప్రముఖ నగదు చెల్లింపుల యాప్ గూగుల్ పే ఇపుడు తన వినియోగదారులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే యేడాది జనవరి నుండి గూగుల్ పే వెబ్​యాప్ సేవల నిలివేయనున్నట్లు ప్రకటించింది. 
 
అలాగే గూగుల్ పే నుండి తక్షణ నగదు బదిలీ చేసినందుకుగాను ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ పే వినియోగదారులు ఇప్పటివరకు డబ్బులు పంపించడానికి గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్‌ను ఉపయోగించే వారు. అలాగే, ఎలాంటి రుసుంను కూడా గూగుల్ వసూలు చేసేది కాదు. కానీ వచ్చే యేడాది నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి.
 
'2021 ప్రారంభంలో, మీరు ఇతర వ్యక్తుల నుండి డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి pay.google.comను ఉపయోగించలేరు. కాబట్టి ఇక నుండి కొత్త గూగుల్ పే యాప్‌ను ఉపయోగించండి" అని కంపెనీ అమెరికా ప్రజలకు సమాచారం ఇచ్చింది. 
 
గూగుల్ పే వెబ్​ యాప్​లో.. పీర్​ - టూ - పీర్ పేమెంట్​ సదుపాయాన్ని వచ్చే యేడాది జనవరి నుంచి అమెరికాలో నిలిపేసేందుకు సిద్ధమైంది. మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి. దీంతో పాటు తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు కూడా అమెరికాలో ఉన్న వినియోగదారులకు మాత్రమేనని భారత యూజర్లకు కాదని తెలిపింది. 
 
ఐఓఎస్​, ఐఓఎస్​ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను ఇటీవలే పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి

Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు

Hreem: షూటింగ్‌ పూర్తి చేసుకున్న హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం హ్రీం

Suhas: హే భగవాన్‌ నుంచి నా సినిమాలు అందర్ని అలరిస్తాయి.: సుహాస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments