Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై తప్పుడు వార్తలు.. 70లక్షల పోస్టులను డిలీట్ చేసిన ఫేస్‌బుక్

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (13:03 IST)
సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ కరోనా గురించి తప్పుడు వార్తలలో పెట్టిన 70 లక్షల పోస్టులను తొలగించినట్లు తెలిపింది. ఏప్రిల్‌, మే, జూన్ నెలల కాలంలోనే ఆయా పోస్టులను తొలగించినట్లు తెలిపింది. కరోనాపై కొందరు కావాలని తప్పుడు వార్తలను ప్రచారం చేశారని, అలాంటి వార్తలకు చెందిన పోస్టులను తాము తొలగించామని ఫేస్‌బుక్ తెలిపింది.
 
కాగా ఆయా నెలల్లో హేట్ స్పీచ్‌కు సంబంధించి 22.5 మిలియన్ల పోస్టులను తొలగించినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. జనవరి నుంచి మార్చి నెలల కాలంలో అలాంటి పోస్టులను 9.6 మిలియన్ల వరకు తొలగించింది. ఇక రెండో త్రైమాసికంలో టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు చెందినవిగా చెప్పబడిన 8.7 మిలియన్ల పోస్టులను తొలగించారు. గతంలో అవే పోస్టులను 6.3 మిలియన్ల వరకు తొలగించారు.
 
అయితే ఫేస్‌బుక్‌లో ఆయా పోస్టులను గుర్తించి వాటిని డిలీట్ చేసేందుకుగాను ఆటోమేషన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అన్ని పోస్టులను మాన్యువల్‌గా గుర్తించి డిలీట్ చేయడం కష్టం కనుక అలా చేస్తున్నట్లు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments