Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

లైంగిక వేధింపులు.. తండ్రినే హతమార్చిన కుమార్తెలు.. ఎక్కడ?

Advertiesment
Medchal
, బుధవారం, 12 ఆగస్టు 2020 (10:43 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతుళ్లపై మద్యం సేవించి లైంగిక వేధింపులకు గురిచేశాడు కసాయి తండ్రి. చివరికి కూతుళ్లే తండ్రిని హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట సీసాలబస్తీలో గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి మాసాని రాజు (50) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, కూతుర్లు సౌమ్య( 17), రమ్య (16)లు ఉన్నారు.
 
ఇతను స్థానికంగా పిండి గిర్నిలో పనిచేస్తుండేవాడు. ఇతడి భార్య ఎనిమిది నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుండి మద్యానికి బానిసగా మారి ఇంట్లో ఉన్న ఇద్దరు కుతుళ్లను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. 
 
కానీ మంగళవారం రాత్రి సమయంలో అతిగా మద్యం సేవించి లైంగికంగా వేధించడంతో ఇద్దరు కూతుళ్లు రాజు గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కూతుర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో మరో అల్పప్రీడన ద్రోణి.. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు