శుభవార్త చెప్పిన ఫేస్‌బుక్ : ఒకే వ్యక్తి పేరుతో ఐదు ప్రొఫైల్స్

Webdunia
శనివారం, 16 జులై 2022 (14:46 IST)
తన యూజర్లకు ఫేస్‌బుక్ శుభవార్త చెప్పింది. ఒకే వ్యక్తి పేరుతో ఐదు ప్రొఫైల్స్ పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చింది. సోషల్‌ మీడియాలో పిల్లలపై నిఘా పెట్టేందుకు తల్లిదండ్రులు వారికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపుతుంటారు. పిల్లలు మాత్రం తమ సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌ జాబితాలో తల్లిదండ్రులు ఉండకూడదని కోరుకుంటారు. 
 
దీంతో కుటుంబసభ్యుల కోసం, ఫ్రెండ్స్‌ కోసం అంటూ వేర్వేరు సోషల్‌ మీడియా ఖాతాలను ఉపయోగిస్తుంటారు. అలాంటి వారికి మెటా సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫేస్‌బుక్‌లో ఒకే ఖాతాతో ఐదు ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉందని, త్వరలోనే యూజర్లకు పరిచయం చేస్తామని మెటా సంస్థ వెల్లడించింది.   
 
'సోషల్ మీడియాలో తమకు నచ్చిన కంటెంట్‌ను షేర్‌ చేయడంలో కొంత మంది యూజర్లు ఫ్రెండ్స్‌ జాబితాలో కుటుంబసభ్యులు, బంధువులు ఉన్నారనే కారణంతో సంకోచిస్తుంటారు. దీంతో వారు తమ ఇష్టాయిష్టాలకు అనుకూలంగా ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలు ఉపయోగిస్తున్నారు. అలాంటి వారు ఒకే ఖాతాతో ఐదు వేర్వేరు ప్రొఫైల్స్‌ పెట్టుకునేలా కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నాం' అని మెటా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

Davos: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో రేవంత్ రెడ్డితో చిరంజీవి

పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో లేయర్స్ ప్రైవ్‌ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

తర్వాతి కథనం
Show comments