Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తొలి ప్రియుడిని రెండో ప్రియుడితో హత్య చేయించిన వివాహిత

murder
, గురువారం, 12 మే 2022 (09:29 IST)
ఓ వివాహిత చెడు మార్గం ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. తన అక్రమ సంబంధం గుట్టు బయటపడుతుందని భయపడి తన తొలి ప్రియుడిని రెండో ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ కేసులో వారిద్దరితో హత్యకు సహకరించిన మరో వ్యక్తి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ దారుణం హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మీర్‌పేటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మీర్‌పేట ప్రశాంతి హిల్స్‌కు చెందిన 32 యేళ్ళ శ్వేతారెడ్డి అనే వివాహితకు ఫేస్‌బుక్ ద్వారా బాగ్ అంబర్‌పేటకు చెందిన యశ్మకుమార్ (32) అనే వ్యక్తితో 2018లో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ముదిరిపాకనపాడటంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఓ రోజున తన ప్రియుడి కోరిక మేరకు శ్వేతారెడ్డి నగ్నంగా వీడియో కాల్ చేసింది. దీన్ని రికార్డు చేసిన యశ్మకుమార్... ఆ తర్వాత బెదిరింపులకు దిగాడు. 
 
తన అక్రమ సంబంధం గుట్టు బయటపడుతుందని ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో శ్వేతారెడ్డికి ఫేస్‌బుక్‌ ద్వారా కృష్ణా జిల్లా తిరుపూరుకు చెందిన అశోక్ (28) అనే వ్యక్తితో పరిచయమైంది. అయితే, తన మొదటి ప్రియుడి వేధింపుల విషయాన్ని అశోక్‌కు చెప్పింది. అశోక్ తన స్నేహితుడు కార్తీక్‌కు కలిసి ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. 
 
అదే రోజు రాత్రి యశ్మకుమార్‌ను శ్వేతారెడ్డి ప్రశాంతి హిల్స్‌కు రప్పించి, రెండో ప్రియుడు అశోక్‌కు చేరవేసింది. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న అశోక్ సుత్తితో యశ్మకుమార్ తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్వేతారెడ్డి తన ప్రియుడు అశోక్, కార్తీక్‌లతో కలిసి హత్య చేసినట్టు తేలడంతో ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం.. షెడ్యూల్ వివరాలివే