Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెలికాం చార్జీలు భారీ స్థాయిలో పెంచాలి : సునీల్ మిట్టల్

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (15:25 IST)
చార్జీల పెంపుపై భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో తక్కువ స్థాయిలో టెలికాం చార్జీలు ఉన్నాయనీ, వీటిని భారీ స్థాయిలో పెంచాలని సూచించారు. అయితే, టెలికాం చార్జీల పెంపపై నిర్ణయం మాత్రం దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీనే తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత టెలికాం చార్జీలింకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయని, మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్‌ పరిస్థితులను పరిశీలించాకే కంపెనీలు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 
 
ఈ విషయంలో ఎయిర్‌టెల్‌ ఒక్కటే ముందడుగు వేయలేదని, ఇండస్ట్రీ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మిట్టల్‌ గతంలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నెలకు 16 జీబీ వినియోగానికి కేవలం రూ.160 చార్జీ చెల్లింపు విషాదకరమన్నారు. 
 
ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.200 స్థాయికి పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ ఏఆర్‌పీయూ రూ.162కు పెరిగింది.
 
ఇకపోతే, 5జీ సేవల్లోకి చైనా టెలికాం పరికరాల కంపెనీలను అనుమతించాలా..? వద్దా..? అనే విషయంపై మిట్టల్‌ స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారన్నారు. అంతేకాదు, 5జీ స్పెక్ట్రమ్‌ ధరలు కంపెనీలకు అందుబాటులో లేవని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments