Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా మహిళపై ఉత్తరాఖండ్‌లో అత్యాచారం..

Advertiesment
American woman
, శుక్రవారం, 9 అక్టోబరు 2020 (12:08 IST)
భారత దేశంలో దేశీయ మహిళలకే కాదు.. విదేశాల నుంచి వచ్చిన మహిళలకు కూడా భద్రత కరువైపోయిందనిపిస్తుంది. తాజాగా అమెరికా నుంచి వచ్చి, ఉత్తారఖండ్‌లో జీవిస్తున్న ఒక పర్యాటకురాలిపై ఏ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు హరిద్వార్‌లోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన 37 ఏళ్ల మహిళ యోగా మీద ఆసక్తితో భారత్‌లోని ఉత్తరాఖండ్ వచ్చి నివాసం ఏర్పరుచుకుంది. డ్రగ్స్, యోగా పట్ల ఆమెకు ఉన్న ఆసక్తితో. ఇంటికి సమీపంలోని అభినవ్ రాయ్ ఆమెకు పరిచయం అయ్యాడు. 
 
అక్టోబర్ 5న అభినవ్ రాయ్ ఆమె ఫ్లాట్ బాల్కనీలోంచి దూకివచ్చి ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. ఇంతకు ముందే వీరిద్దిరి మధ్య లైంగిక సంబంధం ఉందని.. గతంలోనే వారిద్దరూ పలుమార్లు లైంగికంగా కలిసినట్లు అభినవ్ తండ్రి చెప్తున్నాడు. అలాగే ఈ కేసును ఉపసంహరించుకోమని అభినవ్ రాయ్ తండ్రి మహిళపై ఒత్తిడి తెస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్.. తెలంగాణలో 1,500 మార్కుకు చేరిన మృతుల సంఖ్య