Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావ‌ళికి ఎయిర్‌టెల్ 4జీ బడ్జెట్ ఫోన్... ధర ఎంతంటే?

దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు వీలుగా ప్రైవేట్ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లతో ముందుకువస్తోంది. ఇప్పటికే జియోకు ధీటుగా వివిధ రకాల ఆ

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (06:39 IST)
దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు వీలుగా ప్రైవేట్ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లతో ముందుకువస్తోంది. ఇప్పటికే జియోకు ధీటుగా వివిధ రకాల ఆఫర్లను ప్రకటించిన ఎయిర్‌టెల్.. ఇపుడు జియో 4జీ ఫీచర్ ఫోనుకు పోటీగా ఎయిర్‌టెల్ 4జీ బడ్జెట్ ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. 
 
ఈ బడ్జెట్ ఫోన్‌ కోసం ఇప్పటికే ప‌లు మొబైల్ త‌యారీ సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపింది. ఈ చర్చలు సఫలీకృతం కావడంతో దీపావళి నుంచి మార్కెట్‌లోకి విడుదల చేయాలని భావిస్తోంది. ఎయిర్‌టెల్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న 4జీ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా ప‌నిచేయనుంది. ఫోన్‌తో పాటు ఎయిర్‌టెల్ సిమ్‌ను ఉచితంగా అందివ్వ‌నున్నారు. దీంతో ఆక‌ర్ష‌ణీయ‌మైన డేటా ఆఫ‌ర్ల‌ను అందివ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. 
 
కాగా ఈ ఫోన్‌లో డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ వీవోఎల్‌టీఈ, పెద్ద బ్యాట‌రీ, 1 జీబీ ర్యామ్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయ‌ని తెలుస్తున్న‌ది. త్వ‌ర‌లోనే ఈ ఫోన్ గురించి మ‌రింత స‌మాచారం తెలిసే అవ‌కాశం ఉంది. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం మేరకు.. ఈ ఎయిర్‌టెల్ బడ్జెట్ ఫోన్ ధర రూ.2500 నుంచి రూ.2700 మధ్య ఉండే అవకాశం ఉంది. కాగా, రిలయన్స్ జియో రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ని వసూలు చేసి ఉచితంగా ఫోన్‌ను అందజేయనున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments