Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియో దెబ్బకు ఎయిర్ టెల్ రూ.399కే అపరమిత కాల్స్, 84 రోజులు వ్యాలిడిటీ

జియో టెలికం రంగంలో ఎంతటి కుదుపును కుదిపిందో వేరే చెప్పక్కర్లేదు. పైగా జియో స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.1500కే అందిస్తానన్న మాటకు వినియోగదారులు అనూహ్యంగా స్పందించారు. ఇప్పటికే 60 లక్షల మందికి పైగా వినియోగదారులు జియో ఫోన్ ను బుక్ చేసుకోగా, మరికొందరు ఇంకా

జియో దెబ్బకు ఎయిర్ టెల్ రూ.399కే అపరమిత కాల్స్, 84 రోజులు వ్యాలిడిటీ
, శనివారం, 2 సెప్టెంబరు 2017 (18:55 IST)
జియో టెలికం రంగంలో ఎంతటి కుదుపును కుదిపిందో వేరే చెప్పక్కర్లేదు. పైగా జియో స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.1500కే అందిస్తానన్న మాటకు వినియోగదారులు అనూహ్యంగా స్పందించారు. ఇప్పటికే 60 లక్షల మందికి పైగా వినియోగదారులు జియో ఫోన్ ను బుక్ చేసుకోగా, మరికొందరు ఇంకా క్యూలో వున్నారు. 
 
జియో ఇస్తున్న పోటీకి ఎయిర్ టెల్, వొడాఫోన్ దిమ్మతిరిగిపోతున్నాయి. పోటీని తట్టుకోవడం అటుంచి వున్న కస్టమర్లనే కాపాడుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ తాజాగా ఓ ఆఫర్ ప్రకటించింది. ఇది జియో తరహాలోనే వుంది. 
 
రూ.399కే అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందిస్తామని ప్రకటించింది. అలాగే రూ.149 ప్లాన్‌ను 2 జీబీ 4జీ డేటాతోపాటు, 28 రోజుల పాటు ఎయిర్‌టెల్‌ నుంచి ఎయిర్‌టెల్‌కు అపరిమిత కాల్స్‌ చేసుకునే స‌దుపాయాన్ని అందించనున్నట్లు తెలిపింది. మరి ఎయిర్‌టెల్ ఆఫర్‌కు ఎంతమంది ఆకర్షితులవుతారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బండారుతో పాటు ఐదుగురు మంత్రులు రాజీనామా.. తెలంగాణా నుంచి కొత్త ముఖం?