Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు సవాల్ విసిరిన ఎయిర్‌టెల్.. ట్రయల్స్ ప్రారంభం

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (10:01 IST)
కేంద్ర ప్రభుత్వం దేశంలోని టెలికాం కంపెనీలకు 5జీ నెట్‌వర్క్ ట్రయల్స్ నిర్వహించుకోమని అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అవకాశాన్ని దేశంలో తొలిసారి ఉపయోగించుకుంది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌. టెలికాం విభాగం అనుమతిచ్చిన నెల రోజుల్లోనే ట్రయల్స్ ప్రారంభించడం విశేషం. ఇందులో భాగంగానే తాజాగా 5జీ నెట్‌వర్క్‌ను గుర్గావ్‌లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది.
 
ఈ ట్రయల్స్ సందర్భంగా ఎయిర్‌టెల్ 5జీ ఏకంగా 1 జీబీపీఎస్ వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. అంటే ఇకపై ఒక సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కేవలం కొన్ని సెకన్లు సరిపోతుందన్నమాట. ఇదిలా ఉంటే.. ఎయిర్‌టెల్ 5జీ ట్రయల్స్ కోసం ఎరిక్సన్ 5జీ నెట్‌వర్క్ గేర్‌తో కలిసి పనిచేస్తోంది.
 
ఇక ఎయిర్‌టెల్ ముంబైలో సైతం.. ఎయిర్‌టెల్‌ పరీక్షలు నిర్వహించనుంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ టెలికాం సర్కిళ్లలో 5జీ ట్రయల్స్‌ నిర్వహణకు డాట్‌ ఎయిర్‌టెల్‌కు అనుమతిచ్చింది. 5జీ టెస్ట్ కోసం ఎయిర్‌టెల్ ఎరిక్సన్‌తో జట్టుకట్టగా.. జియో 5జీ సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఉపయోగించుకుంది. దేశంలో 5జీ ట్రయల్స్ మరో 6 నెలలపాటు కొనసాగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments