Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్‌ కు లోకేష్ హెచ్చ‌రిక

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (09:43 IST)
రెండేళ్ల జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో అరాచ‌కాలు, విధ్వంసాలే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శలు గుప్పించారు. ఇటీవ‌ల ఎన్నికైన గ్రామ స‌ర్పంచ్‌లు అభివృద్ధి ప‌నులు ప్రారంభిస్తామంటే, వైసీపీ మూక‌లు దాడుల‌కు తెగ‌ప‌డుతున్నాయని మండిపడ్డారు.

గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు స‌ర్పంచ్ అనూరాధ చెరువు మ‌ర‌మ్మ‌తుల ప‌నులు ఆరంభానికి ప్ర‌య‌త్నించ‌గా, వైసీపీ నాయకులు శివ గ్యాంగ్‌ అడ్డుకున్నారని... స‌ర్పంచ్ భ‌ర్త సోమ‌శేఖ‌ర్‌, అత‌ని అనుచ‌రుల‌పై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచి, అంతుచూస్తామ‌ని హెచ్చ‌రించ‌డం వైసీపీ అరాచ‌కాల‌కు అద్దం ప‌డుతోందన్నారు.

గ్రామంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించిన వైసీపీ నేత‌ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా స్పందించ‌క‌పోవ‌డం అన్యాయమని తెలిపారు. టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులపై ప‌డిన ప్ర‌తీ దెబ్బ‌కి మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దని హెచ్చరించారు. మూడేళ్ల‌లో మూర్ఖ‌పురెడ్డి పాల‌న‌కి మూడిపోతుందన్నారు. అంద‌రి ఖాతాలు సెటిల్ చేస్తామని చెప్పారు.

గ్రామంలో మ‌నుషుల్లా, మాన‌వ‌త్వంతో మెలిగితే అదే గౌర‌వం ద‌క్కుతుందని హితవుపలికారు. అధికారం అండ ఉంద‌నే అహంకారంతో అరాచ‌కాల‌కు తెగ‌బ‌డితే...రెండింత‌లు తీసుకునేందుకు సిద్ధంగా వుండండి అంటూ లోకేష్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments