Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో కాల్పుల కలకలం.. భగ్గుమన్న ఫ్యాక్షన్ కక్షలు - ఇద్దరు మృతి

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (09:40 IST)
రాయలసీమ ప్రాంతమైన కడప జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ  కక్షల కారణంగా తుపాకీ కాల్పుల మోతమోగింది. ఈ జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే పులివెందుల మండలం మండ‌లం న‌ల్ల‌పురెడ్డిప‌ల్లెలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. 
 
ప్రసాద్ రెడ్డి తన లైసెన్స్ తుపాకితో పార్థసారథి రెడ్డి అనే వ్యక్తిపై కాల్పలు జరిపాడు. దీంతో ఘటనా స్థలంలోనే పార్థసారథి రెడ్డి మృతి చెందాడు. అనంత‌రం ప్రసాద్‌రెడ్డి అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇరువురూ మృతి చెందారు. 
 
వ్యక్తిగత గొడవలే ఘటనకు కారణమని స్థానికులు అనుకుంటున్నారు. గత కొంత కాలం ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగదాలు నెలకొన్నాయి. ఇదే అంశంపై చాలా సార్లు గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆస్తి విష‌యంలో వివాదాలే కాల్పుల‌కు కార‌ణమ‌ని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments