Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి షాక్.. సుందర్ అవుట్.. ఆకాష్ దీప్‌కు ఛాన్స్

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (14:09 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో 2021లో విరాట్ కోహ్లీకి షాకుల మీద షాక్‌లు తప్పట్లేదు. కారణం.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్… చేతి వేలి గాయం కారణంగా.. ఐపీఎల్ 2021 రెండోదశ మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. 
 
ఆర్సీబీ కీలక ఆటగాళ్లలో ఒకడైన సుందర్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో ఆ జట్టు పై ప్రభావం పడుతుంది. సుందర్ స్థానంలో బెంగాల్ బౌలర్ ఆకాష్ దీప్‌కు ఛాన్స్ ఇచ్చింది.
 
ప్రస్తుతం ఆకాష్ దీప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్యాంప్‌లో నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ఇక అంతకు ముందు సుందర్ ఇదే చేతి వేలి గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలగిన సంగతి విదితమే. 
 
కాగా యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండోదశ మ్యాచులు సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పటికే కొన్ని జట్లు దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ మ్యాచ్‌లో నిమగ్నమై ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 19న మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments