Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ సీజన్ 14 : సీఎస్కే జట్టులో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్

Webdunia
సోమవారం, 3 మే 2021 (15:27 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై జట్టులో కరోనా కలకలం సృష్టించింది. తాజాగా ఆటగాళ్లకు, కోచింగ్‌ సిబ్బంది, ఫ్రాంఛైజీ అధికారులు, ఇతరులకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో ముగ్గురికి పాజిటవ్‌గా నిర్ధారణ అయింది. 
 
చెన్నై టీమ్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిసింది. వైరస్‌ బారినపడిన వారిలో ఆటగాళ్లు ఎవరూ లేరని సమాచారం. 
 
చెన్నై టీమ్‌ సీఈవో కాశీ విశ్వనాథన్‌, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, ఒక బస్‌ క్లీనర్‌లకు వైరస్‌ సోకినట్లు తెలిసింది.  నాన్ ‌- ప్లేయింగ్‌ మెంబర్స్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో ఫ్రాంఛైజీ అప్రమత్తమైంది. కరోనా బారినపడిన వారిని ఐసోలేషన్‌కు తరలించారు. 
 
కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు చెందిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సందీప్ వారియ‌ర్‌ల‌కు క‌రోనా సోకింది. దీంతో సోమ‌వారం రాత్రి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments