Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీపై విమర్శలు.. కేదార్ జాదవ్‌లో స్పార్క్ కనిపిస్తుందా..?

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (15:07 IST)
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలాగే రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా మరోసారి కేదార్ జాద‌వ్‌కి అవకాశం కల్పించాడు మహేంద్రసింగ్ ధోని. దీనిపై కూడా జనాలు మండిపడుతున్నారు. 
 
ముఖ్యంగా కేదార్ జాదవ్ లాంటి ఆటగాళ్లు వరుసగా మ్యాచ్‌లలో విఫలం అవుతున్నప్పటికీ.. యువ ఆటగాళ్లను కాదని కేదార్ జాదవ్ లాంటి ఆటగాళ్లకు జట్టులో అవకాశం కల్పిస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేదార్ జాదవ్ అంతలా రాణించలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన ధోని యువ ఆటగాళ్లలో స్పార్క్ లేదని అందుకే ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం లేదు అంటూ చెప్పాడు. 
 
దీనిపై స్పందించిన భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ధోనీకి చురకలు అంటించాడు. యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించడం లేదు సరే.. పేలవ ప్రదర్శన చేస్తున్న కేదార్ జాదవ్‌లో మాత్రం ధోనీకి స్పార్క్ కనిపిస్తుందా అంటూ మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తెలిపాడు.

సంబంధిత వార్తలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

తర్వాతి కథనం
Show comments